ఇదెక్కడి క్రైమ్ థ్రిల్లర్?: 28 కోట్లు పెడితే 200 కోట్లకి పైగా తెచ్చిందే

V. Sai Krishna Reddy
1 Min Read

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారి సంఖ్య చాలా ఎక్కువ. సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి అంతా ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మోహన్ లాల్ నుంచి ఒక క్రైమ్ థ్రిల్లర్ థియేటర్లకు వచ్చింది .. ఆ సినిమా పేరే ‘తుడరుమ్’. రెంజిత్ నిర్మించిన ఈ సినిమాకి, తరుణ్ మూర్తి దర్శకత్వం వహించాడు.

ఏప్రిల్ 24వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేశారు. మోహన్ లాల్ సరసన ‘శోభన’ నటించిన ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. మోహన్ లాల్ కి గల క్రేజ్ గురించి .. మార్కెట్ గురించి తెలియంది కాదు. అయినా కథకు తగినట్టుగా ఖర్చు చేస్తూ, కేవలం 28 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.

అలాంటి ఈ సినిమా కేరళలోనే 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. మలయాళ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన మూడో సినిమాగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించింది. అలాంటి ఈ సినిమా, జూన్ లో ‘హాట్ స్టార్’ ద్వారా స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.

కథ విషయానికి వస్తే .. హీరో ఒక ట్యాక్సీ డ్రైవర్. నీతి – నిజాయితీతో కూడిన సింపుల్ లైఫ్ అతనిది. ఆయనకు ఇద్దరు పిల్లలు. హీరో కొడుకు తన తండ్రి కారులో స్నేహితులతో కలిసి సరదాగా ‘చెన్నై’ కి వెళతాడు. ఆ కారులో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారని పోలీసులు కారు సీజ్ చేస్తారు. ఆ సంఘటనతో హీరో లైఫ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లో పడుతుందనేది కథ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *