నిత్యం రద్దీగా ఉండే చార్మినార్ మంగళవారం నాడు విభిన్నంగా కనిపించింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పాతబస్తీలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పర్యటించనున్నారు. హెరిటేజ్ వాక్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఒక్కరోజు చిరు వ్యాపారుల దుకాణాలు కూడా మూసివేయించారు. చార్మినార్ వద్ద సుందరీమణులకు గ్రాండ్ వెల్కమ్ కార్యక్రమంలో భాగంగా అక్కడి పరిసరాలను పూలతో అందంగా అలంకరించారు. ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ అతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.