ములుగు, మే 06 (ప్రజాజ్యోతి)::
మైనారిటీ గురుకులంలో ప్రవేశాలకు గురువారం లక్కీ డిప్ నిర్వహించనున్నారు. ములుగు మండలంలోని దేవగిరి పట్టణంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో ఐదవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను రేపు (గురువారం )ఉదయం 10 గంటల 30 నిమిషాలకు డ్రా పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపాల్ వై శ్రీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో నాన్ మైనారిటీ విభాగంలో బిసి ,ఎస్సి ,ఎస్టి, ఓసి విద్యార్థులను తల్లిదండ్రుల సమక్షంలో డ్రా పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సకాలంలో హాజరుకావాలని కోరారు. లక్కీ డిప్ పర్యవేక్షకులుగా డీఎండబ్ల్యూఓ రవీందర్, ఆర్ ఎల్ సి రమేష్ లాల్ హట్కర్, ఉమ్మడి వరంగల్ జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్ రుహీనా హాజరుకానున్నట్లు తెలిపారు.