
విద్యుత్ పోల్స్ మరమ్మతు చేయండి
— 13వ వార్డు హరీష్
రామారెడ్డి జనవరి 29 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి కేంద్రంలోని 13వ వార్డులో విద్యుత్ పోల్స్ అద్వాన్నంగా ఉన్నందున ప్రజలకు అదేవిధంగా నివాస గృహాలపై వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసి అవసరమైన మేరకు నూతన విద్యుత్ పోల్స్ ను వేయవలసిందిగా, ప్రస్తుతం ఉన్న విద్యుత్ సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉండడం వలన ఇక్కడ నుండి వేరే చోటికి మార్చవలసిందిగా వార్డు మెంబర్ హరీష్ తెలపడం జరిగింది. విద్యుత్ శాఖ సిబ్బందికి తెలపడం జరిగింది. ఇందులో భాగంగా లైన్ ఇన్స్పెక్టర్ ఏసురత్నం, లైన్మెన్ కైలాష్ పతి, విద్యుత్ సిబ్బంది. మాట్లాడుతూ ఈ యొక్క పనులకు సంబంధించి తీర్మానాన్ని వ్రాసివ్వాల్సిందిగా తెలిపారు. ఈ విషయంలో గ్రామ సర్పంచ్ బండి ప్రవీణ్ కుమార్ 13వ వార్డు సభ్యుల సమస్య ను తీర్చవలసిందిగా వార్డు సభ్యులు కోరారు.
