అమెరికా, కెనడా పర్యటనకు వెళుతున్న మంత్రి నారా లోకేశ్

V. Sai Krishna Reddy
1 Min Read

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో ఆయన అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఇద్దరు ఉన్నతాధికారులు కార్తికేయ మిశ్రా, అభిషిక్త్ కిశోర్ కూడా పాల్గొననున్నారు. వీరిద్దరి పర్యటనకు అనుమతిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో మంత్రిగా నారా లోకేశ్ చేపట్టిన విదేశీ పర్యటనలు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో విజయవంతం అయ్యాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో జరిపిన పర్యటనల ద్వారా మంచి స్పందన లభించింది. ఇటీవల విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్యంతో నిర్వహించిన సదస్సు విజయవంతం కావడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజా పర్యటనపై కూడా పరిశ్రమ వర్గాల్లో సానుకూల అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు రోజుల పర్యటన ద్వారా రాష్ట్రానికి సరికొత్త పెట్టుబడులు వస్తాయని, పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *