ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

Nalgonda Bureau
1 Min Read

ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

తుంగతుర్తి, ఏప్రిల్ 22,(ప్రజా జ్యోతి):

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన జర్నలిస్టులకు ఇండ్ల పంపిణీలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ (డీజేఆఫ్) రాష్ట్ర కార్యదర్శి ఓరిగంటి శ్రీనివాస్ ,జిల్లా అధ్యక్షులు కొండగడుపుల ఎల్లయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ… ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ఎటువంటి జీతభత్యాలు లేకుండా ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రభుత్వ అధికారుల చేత పనులు చేయిస్తూ, చాలీచాలని జీవన భృతితో జీవనాలు సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో జర్నలిస్టు కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఈ సమావేశంలో డీజేఎఫ్ మండల జర్నలిస్టులు పోలేపాక రామచంద్రు, ఇరుగు సైదులు, గుండగాని రాము, రామకృష్ణ, షేక్ దస్తగిరి, కొండగడుపుల ఉమేష్, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *