విద్యా సామగ్రి పంపిణీ చేసిన యువజన ఫౌండేషన్ వారు

Submitted by Degala shankar on Mon, 26/09/2022 - 13:40
Yuvajana Foundation distributed educational materials

బజార్ హత్నూర్ సెప్టెంబర్25(ప్రజాజ్యోతి),.//, బజార్ హాత్నూర్ మండలంలోని గిరిజన మారుమూల ప్రాంతం అయిన డెడ్రా ప్రాథమిక పాఠశాలలో  యువజన ఫౌండేషన్ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి అనంతరం విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, తదితర విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఫౌండేషన్ అధ్యక్షలు బుద్దర్తి నవీన్ గారి సూచనతో ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇట్టి కార్యక్రమంలో యువ జనత  ఫౌండేషన్ సభ్యులు గాజుల నరేష్ , కొడరి శ్రీకాంత్, అంగ శేకర్, మధుకర్, శ్రీదర్, ప్రశాంత్, సుధీర్, గ్రామ పటేల్ లింగు, సర్పంచ్ భింరావ్, గ్రామస్థులు, వానర సేన యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.