వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతమే లక్ష్యం

Submitted by narmeta srinivas on Tue, 27/09/2022 - 19:53
మాట్లాడుతున్న బీరెల్లి శ్రీనివాస్ రెడ్డి

జనగామ (ప్రజా జ్యోతి) సెప్టెంబర్ 27 : 
తెలంగాణ ప్రజల కష్టాలు పోవాలంటే వైఎస్ఆర్ తెంగాణ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల పరిశీలకులు బీరవెళ్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ సింగారం రవీందర్ మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు మండల స్థాయిలో పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయని, గ్రామస్థాయిలో కూడా పార్టీలోకి యువత చేరుతున్నారని, రానున్న వారం రోజుల్లో ప్రతి మండలంలో, గ్రామాలలో పార్టీ కమిటీలను నియమిస్తామని తెలిపారు. పూర్తి స్థాయిలో పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పాటుపడుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్గన్పూర్ నియోజకవర్గాల నుంచి ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.