పోషక ఆహారాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇల్లందు సీడీపీఓ యం.లక్ష్మీ ప్రసన్న తెలిపారు. శుక్రవారం పోషక పక్షంలో భాగంగా మండల పరిధిలోని చల్లసముద్రం జడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాలలో చిరు దాన్యంపై అవగాహన కల్పించారు.ఈసందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ రోజువారీగా తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించారు.అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రధమ,ద్వితీయ,తృతీయ బహుమతులను అందజేశారు.ఈకార్యక్రమంలో ఏసీడీపీఓ జె.విజయ కుమారి,సూపర్ వైజర్ కె.లక్ష్మీ కుమారి,పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు,అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.
- 10 views