వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి),...../వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలు శుక్రవారం భద్రాచలం-వెంకటాపురం ప్రదాన రహదారిపై కంకల వాగు బ్రిడ్జి వద్ద, భద్రాచలం-వాజేడు రహదారి పై శాంతినగర్ వద్ద రెండు చోట్ల పలు గ్రామాల కు చెందిన కూలీలు రోడ్డు పై భైటా ఇంచి ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘo జిల్లా నాయకులు గ్యానం వాసు మాట్లాడుతూకూలీ రేటు పెంచాలని కోరుతూ వివిధ రకాలుగా కూలీలు కూలీ పనుల కు వెళ్లకుండా ఆందోళనలు చేస్తున్నారన్నారు.చర్చల పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజు వారీ కూలీ రూ.200 నుంచి రూ.311 కి పెంచాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీలా రేట్లు పెంచేదాకా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఏస్ఐ అశోక్ సంఘటన స్థలానికి చేరుకుని సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడు కోవాలని రైతులతో చర్చలు జరిపేల చర్యలు తీసుకుంటామని హామీఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంకా రాములు , కుమ్మరి శ్రీను, కట్ల చారి, ఆదినారాయణ, రాంబాబు, సరస్వతి, పలు గ్రామాల కూలీలు పాల్గొన్నారు.
- 2 views