మొబైల్ ఫోన్ కు చార్జింగ్ పెడుతుండగా షాక్ గురై మహిళ మృతి

Submitted by bheemaraidu on Sat, 01/10/2022 - 13:04
A woman died of shock while charging her mobile phone

◆ జడ్పిటిసి రూ 20,000 రూపాయల ఆర్థిక సహాయం 

గద్వాల ప్రతినిధి( ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 30 :  జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన జ్యోతి( 25) ఉదయం తన వ్యవసాయ పొలం దగ్గర గుడిసెలో సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ గురై మరణించింది. భార్యాభర్తలు తమ పొలం దగ్గర గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వంట చేసుకుని శుక్రవారం తెల్లవారుజామున మొబైల్ ఫోన్ కు చార్జింగ్ పెడుతుండగా షాక్ గురై, చికిత్స నిమిత్తం గద్వాల ఏరియా హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు ఏఎస్ఐ ఈశ్వరయ్య తెలిపారు. తల్లి శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి మృతురాలు కుటుంబానికి రూ.20వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఎంపీపీ వై.రాజారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వపరంగా కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ మెంబర్ అహ్మద్, మేకల్ సోంపల్లి ఎంపిటిసి లక్ష్మీదేవి, వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.