ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 29 సెప్టెంబర్.//...పేట పట్టణంలోని 48వ వార్డులో కోట మైసమ్మ బజారులో గురువారం అంగన్వాడి పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ రోజును కౌన్సిలర్ వెలుగు వెంకన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వెలుగు వెంకన్న మాట్లాడుతూ..... ప్రపంచంలో ఏ వస్తువైనా డబ్బుతో కొనలేనిది అంటూ ఉంటే అది తల్లిదండ్రుల ప్రేమే అని అన్నారు .నానమ్మ అమ్మమ్మ, తాతయ్య లతో కొద్ది పాటి సమయాన్ని గడుపుతే వారి నుండి వచ్చే జ్ఞాన సంపద ఎంతో విలువైనదని తెలిపారు. అనుభవానికి మించిన గొప్ప జ్ఞానం మరొకటి లేదని పేర్కొన్నారు. అనంతరం పిల్లలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ రూప, సూపర్వైజర్ నగీత ,ఉపేంద్ర, అనంతలక్ష్మి, రేణుక పాల్గొన్నారు.
- 2 views