దాడిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి.
-తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం.
జనగామ, సెప్టెంబర్21, ప్రజాజ్యోతి :- దౌర్జన్యంగా భూమి విక్రయించాలని వృద్ధ దంపతులపై దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాద్యక్షుడు రెడ్డబోయిన హరికుమార్ ముదిరాజ్ బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం పులుమామిడి గ్రామానికి చెందిన యాదయ్య దంపతులకు గల మూడు ఎకరాల భూమిని తమకు విక్రయించాలని సినిమాల్లో తరహా దౌర్జన్యానికి పాల్పడిన ప్రజాప్రతినిధి భర్త రామకృష్ణ వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు.ఒక ప్రజా ప్రతినిధి భర్తగా ఉండి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవాలి కానీ రాజకీయాన్ని ఉపయోగించుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ దౌర్జన్యాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.రామకృష్ణ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .