నిడమనూరు, అక్టోబర్02(ప్రజాజ్యోతి): మహాత్మగాంధీ అడుగుజాడల్లో మనమంతా నడుచుకుంటు మనం మహాత్ముడికి ఇచ్చే ఘనమైన నివాళి మువ్వ అరుణ్ కుమార్ అన్నారు.ఆదివారం హాలియా పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ అడుగుజాడలలో నేటి యువతరం నడవాలని, అహింసా మార్గంతోనే స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి జాతిపిత గాంధీ మహాత్ముడేన్నారు.అదేవిధంగా సత్యం , అహింసా, ధర్మం, మార్గాలలో నడిచిన బాపూజీ కుల,మతవర్గ విభేదాలు లేని అభివృద్ధి చెందిన భారతదేశాన్ని కలలు కనటమే కాకుండా అందుకు కృషి చేస్తున్నారు. అదేవిధంగాప్రపంచ వ్యాప్తంగా కోలుచుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు ఉడుతూరి నరసింహ రెడ్డి, నిడమనూరు మండల పార్టీ అధ్యక్షులు మంద తిరుపతయ్య, జిల్లా నాయకులు పాతనబోయిన సైదులు, తిరుమలగిరి మండల అధ్యక్షులు శాగం లింగారెడ్డి, యడవెల్లి సైదులు, పల్లెబోయిన కోటేష్ యాదవ్, కురాకుల కొండలు, మిరియాల సైదయ్య, యడవల్లి శంకర్, చేగొండి రవి, చల్లా బాలకృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు
- 2 views