మహాత్మ గాంధీ అడుగుజాడల్లో నడవటమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి -ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Submitted by Sathish Kammampati on Mon, 03/10/2022 - 10:47
Walking in the footsteps of Mahatma Gandhi is a great tribute to him  -MLA Chirumurthy Lingaiah

నల్లగొండ అక్టోబర్ 02(ప్రజాజ్యోతి)./..మహాత్మాగాంధీ అడుగుజాడల్లో మనమంతా నడవటమే మనం మహాత్ముడి కి ఇచ్చే ఘనమైన నివాళి అని నకిరేకల్ శాసన సభ్యులు  చిరుమర్తి లింగయ్య అన్నారు..ఆదివారం నకిరేకల్ పట్టణంలో  మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా  మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ మహాత్మాగాంధీ అడుగుజాడలలో నేటి యువతరం నడవాలని, అహింసా మార్గంతోనే స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి జాతిపిత గాంధీమహాత్ముడేనన్నారు.సత్యం , అహింసా, ధర్మం, మార్గాలలో నడిచిన బాపూజీ కుల, మతవర్గ విభేదాలు లేని ఆభివృద్ధి చెందిన భారతదేశాన్ని కలలు కనటమే కాకుండా అందుకు కృషి  చేస్తూ అమరులయ్యారన్నారు.  నేటికి ప్రపంచ వ్యాప్తంగా కోలుచుకుంటారన్నారు.