మహాత్ముడి అడుగుజాడల్లో నడవాలి - టిడిపి పార్టీ నాగార్జునసాగర్ ఇన్చార్జి మువ్వా అరుణ్ కుమార్

Submitted by kareem Md on Mon, 03/10/2022 - 11:52
 Walk in the footsteps of Mahatma   - TDP party Nagarjunasagar in-charge brother Arun Kumar

హలియా,సెప్టెంబర్02(ప్రజా జ్యోతి):   జాతిపిత మహాత్మాగాంధీ  అడుగుజాడల్లో నడవటమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని నాగార్జునసాగర్ టిడిపి ఇన్చార్జ్ మువ్వ అరుణ్ కుమార్ అన్నారు.ఆదివారం హలియా పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ మహాత్మాగాంధీ అడుగుజాడలలో నేటి యువతరం నడవాలని సూచించారు.అహింసా మార్గంతో భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి జాతిపిత గాంధీ మహాత్ముడే అన్నారు.సత్యం,ధర్మం,అహింస మార్గాలలో నడిచిన బాపూజీ కుల,మత వర్గ విభేదాలు లేని ఆభివృద్ధి చెందిన భారతదేశాన్నే కలలు కనడమే కాకుండా,అందుకు కృషి చేస్తూ అమరులయ్యారన్నారు.నేటికి ఆయనను ప్రపంచ వ్యాప్తంగా కోలుస్తూన్నారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు ఉడుతూరి నరసింహ రెడ్డి,నిడమనూరు మండల పార్టీ అధ్యక్షుడు మంద తిరుపతయ్య,జిల్లా నాయకులు పాతనబోయిన సైదులు,తిరుమలగిరి మండల అధ్యక్షుడు,శాగం లింగారెడ్డి, యడవెల్లి సైదులు, పల్లెబోయిన కోటేష్ యాదవ్, కూరాకుల కొండలు,మిరియాల సైదయ్య,యడవల్లి శంకర్, చేగొండి రవి,చల్ల బాలకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.