సీఎం చిత్రపటానికి వినతి పత్రం అందజేసిన వీఆర్ఏలు

Submitted by Upender Bukka on Sat, 10/09/2022 - 15:27
VRAs submitted petition for CM's portrait

తిరుమలగిరి టౌన్, సెప్టెంబర్ 9( ప్రజా జ్యోతి )  తిరుమలగిరి టౌన్ తహశిల్దార్ కార్యాలయం అవరణలో  రాష్ట్ర వీఆర్ఏ, జేఏసీ పిలుపు  మేరకు నిరవేదిక సమ్మె 47వ రోజు లో  భాగంగా   వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  వారు రాసిన వినతి పత్రాన్ని సీఎం కేసీఆర్ చిత్రపటానికి అందజేశారు. కేసీఆర్ గతంలో వీఆర్ఏలకు పే స్కేల్  ఇస్తానని చెప్పి  ఏండ్లు  గడుస్తున్న వాటిని నెరవేర్చకపోవడం  బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మాట ఇచ్చిన ప్రకారం పే స్కేల్  ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేస్కేలు ఇచ్చేంతవరకు సమ్మె కొనసాగిస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఈ సమ్మెలో భాగంగా విఆర్. ఏ సంఘ అధ్యక్షుడు పల్లెర్ల  వెంకన్న, ఉపాధ్యక్షుడు ఖమ్మం పార్టీ లక్ష్మయ్య ,ప్రధాన కార్యదర్శి చింతకాయల సత్తయ్య ,వెంకన్న, గణపతి ,సత్తయ్య, క్రాంతి ,దేవయ్య, ఖలీల్, యాదమ్మ, రాములు, ఆగేష్ తదితరులు పాల్గొన్నారు.