మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన జిబి తండ గ్రామస్థులు

Submitted by narmeta srinivas on Mon, 21/11/2022 - 18:31
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన జిబి తండ గ్రామస్థులు

పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 21 : రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కొడకండ్ల మండల జిబి తండ గ్రామస్తులు హనుమకొండ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రామ అభివృద్ధి కార్యాచరన విషయం లో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో జిబి తండా గ్రామ సర్పంచ్ కుమారి గుగులోతు మంజుల, టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గుగులోతు బాషా నాయక్ ,గ్రామ నాయకులు వస్రం నాయక్ ,మాజీ ఎంపీటీసీ రామ్ మూర్తి నాయక్ , వీరేష్, మహేష్, వెంకన్న, మహేందర్,  సురేష్ , వీరేష్, నరేష్ ,రమేష్  తదితరులు పాల్గొన్నారు.