సీ సీ రోడ్డు పనులను ప్రారంభించిన మంచికంటి వెంకటేశ్వర్లు.

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 12:45
Venkateswarlu who started the works of Sea Sea Road.

గుర్రంపోడ్:సెప్టెంబర్ 28(ప్రజా జ్యోతి)..///..గుర్రంపోడు మండలం బ్రాహ్మణ గూడెం గ్రామపంచాయతీ పరిధి లోని పల్లె పహాడ్ గ్రామంలో బుధవారం నల్లగొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన సీ సీ రోడ్డు పనులను ప్రారంభించారు.అనంతరం గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామపంచాయతీల అభివృద్ధి కొరకు ప్రతి గ్రామపంచాయతీలో హరితహారం మొక్కలు,సీ సీ రోడ్లు, ఇంటింటికీ నల్లా నీరు,వైకుంఠ ధామాలు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామపంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరి ధనుంజయ,మండల తెరాస అధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్ రావు,స్థానిక సర్పంచ్ బద్రి యాదయ్య,ఉపసర్పంచ్ విజయ్,పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.