ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 29 సెప్టెంబర్./...తెలంగాణ ముదిరాజ్ మహాసభ సూర్యపేట పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలిగా జిల్లా కేంద్రానికి చెందిన సారగండ్ల వెంకటమ్మను నియమిస్తూ అధ్యక్షుడు ఈధుల యాదగిరి శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకటమ్మ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలోని ముదిరాజ్ మహిళలను ఐక్యం చేసి సంఘ పటిష్టతకు పాటుపడుతానని, సూర్యాపేట పట్టణంలో ముదిరాజ్ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో పట్టణ మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించిన ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఈదుల యాదగిరి, గుంటి సైదులు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటమ్మ నియమకం పట్ల పట్టనానికి చెందిన ముదిరాజ్ కులస్తులు, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
- 5 views