మాయ మాటలతో రూ 7500 దొంగిలించిన గుర్తుతెలియని వ్యక్తి..

Submitted by kosgi narsimulu on Mon, 03/10/2022 - 14:34
Unidentified person who stole Rs 7500 with fake words..

- సిసి ఫుటేజీలను పరిశీలిస్తున్న బ్యాంకు అధికారులు పోలీసులు

తాండూరు అక్టోబర్ 3 ప్రజా జ్యోతి :-  తాండూరు పట్టణానికి చెందిన గిరిబాబు అనే వ్యక్తి తన ఖాతాలో నుంచి విత్  డ్రా చేసుకున్న డబ్బులు రూ 20 వేలు కాగ అందులోని రూ 12,500 రూపాయలు  తన జేబులో పెట్టుకున్నాడు.  మిగతా రూ 7వేల 500 రూపాయలు  టేబుల్ పై పెట్టి లెక్కిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మాయ మాటలతో  మోసగించి అపహరించుకుపోయినట్లు బాధితుడు తెలియజేశాడు .ఇట్టి  విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు తాండూరు పట్టణం సౌకార్ పేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( మేయిన్  బ్రాంచ్) వద్దకు చేరుకొని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.