జక్కి నగేష్ టిఆర్ఎస్వి జిల్లా ప్రధాన కార్యదర్శి
బిబినగర్, సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి)..../ బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేదల కార్పొరేటర్ దవాఖానాకాల్లో వైద్యం పొందేoదుకు సీఎం సహాయ నిధి ఎంతో దోహదపడుతుందని టిఆర్ఎస్వి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కినగేష్ అన్నారు.మంగళవారం రోజున బీబీనగర్ మండల పరిధిలోని ఎర్రబెట్టి తండాకు చెందిన భానోత్ నికితభువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన 44000 వేల రూపాయలు సీఎం సహాయ నిధి లబ్ధిదారికి చెక్కుపంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దని ముఖ్యమంత్రి సహాయ నిధిని కేసీఆర్ ఏర్పాటు చేశారని వారు అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు అభ్యున్నతికి పాటు పడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు.