అనుమతి లేని ప్రైవేట్ ఆస్పత్రులు సీజ్.

Submitted by Praneeth Kumar on Tue, 27/09/2022 - 14:16
Unauthorized private hospitals are under sieze.

అనుమతి లేని ప్రైవేట్ ఆస్పత్రులు సీజ్.
- పలు ఆస్పత్రులకు నోటీసులు జారి.

ఖమ్మం అర్బన్, సెప్టెంబర్ 27, ప్రజాజ్యోతి.

ఖమ్మంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొరడా జులిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పలు ఆసుపత్రులను తనిఖీ చేశారు. తొలుత డిఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, డిప్యూటి డిఎంహెచ్ డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో వైరా రోడ్లోని స్వాతి ఆసుపత్రిని తనిఖీ చేశారు. అక్కడ పేషంట్ల తాలూకు సరైన రికార్డులు నిర్వహించకపోవటాన్ని గుర్తించారు. ఎక్కువ మంది పేషంట్లు వచ్చినా, రికార్డుల్లో తక్కువగా ఉన్నట్లు చూపించి మిగితా వారిని వేరే ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తుండటాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఆసుపత్రి యాజమన్యానికి నోటిసులు జారి చేశారు. అనంతరం అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ను తనిఖీ చేశారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ల్యాబ్ నిర్వహిస్తుండటాన్ని గుర్తించారు. అంతే కాకుండా బయో మెడికల్ వ్యర్ధాలు ల్యాబ్లో పేరుకు పోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్త షాంపుల్స్ నిల్వ ఉండటం పై యాజమాన్యాన్ని ప్రశ్నించి, ల్యాబ్ను సీజ్ చేశారు. అదే ప్రాంతంలో అనుమతులు లేకుండా నడుపుతున్న దంత వైద్యశాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ డాక్టర్ మాలతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయివేటు ఆసుపత్రులు, డయోగ్నస్టిక్ సెంటర్లను తనిఖీ చేస్తున్నామన్నారు. అందులో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో అనుమతులు లేకుండా నడుపుతున్న వాటిని సీజ్ చేశామన్నారు. ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.