పిడుగు పడి రెండు పాడి గేదేలు మృతి

Submitted by Paramesh on Sat, 01/10/2022 - 11:25
 Two dairy buffaloes died due to lightning

నేరేడుచర్ల, సెప్టెంబర్ 30(ప్రజాజ్యోతి):  నేరెడుచర్ల మండల పరిధిలోని భూర్గుల తండాలో పిడుగు పడి రెండు పాడి గేదెలు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం బురుగుల తండా కు చెందిన కేతావత్ జానికి రాములు తండ్రి గెమ్య అనే రైతుకు చెందిన రెండు గేదెలు పిడుగు పాటుకు  మృతి చెందడం జరిగింది.వీటి విలువ సుమారు 80000 వేల రూపాయలు కావడంతో ఆస్తి నష్టం జరిగిందని రైతు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు.ప్రమదశాత్తు జరిగిన నష్టానికి ప్రభుత్వ సహకారం అందించాలని వేడుకుంటున్నారు