చర్లగూడం భూ నిర్వాసితుల కు అండగా టి ఎస్ యు అధినేత అంజి

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 11:10
TSU head Eng

మునుగోడు సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి): చర్లగూడెం రిజర్వాయర్ కింద అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల భూములను ప్రాజెక్టుకు తీసుకొని వారికి సరైన న్యాయం చేయలేక ప్రభుత్వం మొండి చేయి చూపిస్తున్నది రిజర్వాయర్ కింద భూమి పోగొట్టుకున్న ప్రజలకు  మద్దతు ధర ఇవ్వాలని తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర నాయకులు నల్లగొండ అంజి మునుగోడు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో దీక్ష చేస్తుండగా అక్రమ అరెస్టు చేసినారు.
చర్లగూడెం రిజర్వాయర్ కింద భూములు పోగొట్టుకున్న నిర్వాసితులకు తగిన న్యాయం జరిగేదాకా నా పోరాటం ఆపనని ఆవేదన వ్యక్తం చేశారు.