బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు

Submitted by Mdrafiq on Sun, 04/09/2022 - 13:40
TRS senior leaders visited the victim's family

వేములవాడ, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి) : వేములవాడ రూరల్ మండలం వట్టెముల గ్రామానికి చెందిన కాసారపు వజ్రవ్వ అను మహిళ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని వేములవాడ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మంద శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఆమె మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.