తెరాస నాయకుల విస్తృత స్థాయి సమావేశం

Submitted by lenin guduru on Sat, 03/12/2022 - 19:01
ఫోటో

తెరాస నాయకుల విస్తృత స్థాయి సమావేశం

దేవరుప్పుల,డిసెంబర్ 3, (ప్రజాజ్యోతి):-

దేవరుప్పుల మండల కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి,ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశాలు మేరకు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్ అధ్యక్షతన మండల ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం మండల తెరాస పార్టీ ఇంచార్జి బిల్లా సుదీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివారం నుండి ప్రతీ గ్రామంలో నూతన బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, జడ్పీటీసీ పల్లా భార్గవి సుందర్ రాంరెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చింత రవి, జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ కారుపోతుల భిక్షపతి, రైతు బంధు సమితి అధ్యక్షులు నర్సింహారెడ్డి, పాక్స్ డైరెక్టర్ కొత్త జెలెండర్, మార్కెట్ వైస్ ఛైర్మన్ కృష్ణమూర్తి, మార్కెట్ డైరెక్టర్ కుతాటి నర్సింహా, మండల అధికారు ప్రతినిధి సుడిగిలా హనుమంతు, ముఖ్య నాయకులు, దారవత్ రాంసింగ్ నాయక్, ఎండి ఖాసిం, తటిపెళ్లి మహేష్, వివిధ గ్రామాల ఇంచార్జిలు, మండల తెరాస పార్టీ యూత్ అధ్యక్షులు భానోతు నవీన్ నాయకు, యూత్ నాయకులు గుండె రమేష్, తదితరులు పాల్గొన్నారు.