మీడియా పాయింట్ అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులకు సన్మానం

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 12:27
 Tribute to Media Point President and Executive Committee members

కాజీపేట టౌన్, అక్టోబర్02 (ప్రజాజ్యోతి)./...ఇటీవల కాజిపేట మీడియా పాయింట్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ రిపోర్టర్ బత్తిని రాజేందర్ గౌడ్ ను సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం హానుమకొండ జిల్లా అధ్యక్షులు జూలూరి రంజీత్ గౌడ్ అధ్యక్షత కాజీపేట ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ జనగాం శ్రీనివాస్ గౌడ్ లు హాజరైమాట్లాడుతూ రాజేందర్ గౌడ్ అనేక సంవత్సరాల నుండి ఈనాడు, సాక్షి పత్రికలో రిపోర్టర్ గా సేవలు అందిస్తున్నారని అన్నారు. గ్రేటర్ పరిధిలో సుమారు 150 మంది ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో గౌడ విలేకరులు ఉన్నారన్నారు. గౌడ విలేకరులు ప్రెస్ లో ఉన్నత స్థానాలు  పొందాలని, మరిన్ని సేవలు అందించాలని వారు కోరారు. రాజేందర్ గౌడ్ తో పాటు కమిటీలో ఎన్నికైన మీడియా పాయింట్ ఉపాధ్యక్షుడు పూజారి రంజీత్ గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, శ్యామ్ గౌడ్ లను కూడ సన్మానించారు.     ఈ కార్యక్రమంలో మనం రిపోర్టర్  గౌని సాంబయ్య గౌడ్, సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం నాయకులు బొలికొండ యాదగిరి గౌడ్, తాళ్లపెళ్లి రమేష్ గౌడ్, శ్రీపతి గోపి గౌడ్, ఏరుకొండ రమేష్ గౌడ్, చిర్ర నర్సింగ్ గౌడ్, బండి రాజు గౌడ్, పిల్లల కుమారస్వామి గౌడ్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.