జాతిపిత కు ఘన నివాళి

Submitted by kareem Md on Mon, 03/10/2022 - 10:11
 Tribute to the father of the nation

హాలియా,సెప్టెంబర్2( ప్రజా జ్యోతి):   కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు. ఆదివారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని హాలియా మున్సిపాలిటీ ప్రధాన కూడలి లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల పార్టీ అధ్యక్షుడు కూందూరు వెంకట్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి లు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ హక్కుల సాధనకై శాంతియుత పోరాట మార్గాన్ని ప్రవచించి ఆచరణలో చూపిన మహాత్ముడు చిరస్మరణీయుడు అన్నారు. అహింస,సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహాత్మా గాంధీ మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయం, అనుసరణీయం అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ జూపల్లి శ్రీనివాస్,పిల్లి ఆంజనేయులు,కుందూరు రాజేందర్ రెడ్డి,పాంపాటి శ్రీనివాస్ నకిరేకంటి సైదులు, వర్కాల శ్రీనివాస్ రెడ్డి హనుమంతరావు ఆంజనేయులు,యూత్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అజ్జు,గార్లపాటి మహేష్,బద్దేపాక విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.