శాంతి మార్గంలో ప్రయాణించాలి

Submitted by kareem Md on Mon, 03/10/2022 - 10:56
Travel on the path of peace

- టిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేష్ యాదవ్
హలియా,సెప్టెంబర్2ప్రజా జ్యోతి:  
జాతిపిత మహాత్మా గాంధీ చూపించిన శాంతి మార్గంలో ప్రయాణించాలని రాష్ట్ర టిఆర్ఎస్ కార్యదర్శి చల్లా కోటేష్ యాదవ్ అన్నారు. ఆదివారం గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో మహాత్ముని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ చూపిన మార్గం ద్వారానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారం అయిందని అన్నారు.ప్రపంచ శాంతికి మార్గదర్శకుడు గాంధీజీ అన్నారు.నేటి సమాజంలో ప్రతి ఒక్కరు శాంతి మార్గంలో ప్రయాణించినట్లయితే ప్రతి సమస్యను సులువుగా పరిష్కరించుకోవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ టి ఆర్ ఎస్ వి అధ్యక్షుడు లింగయ్య యాదవ్,చింతల సందీప్ యాదవ్,బత్తుల లింగయ్య,మర్రి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.