తుంగతుర్తి లో విషాదం.. పిడుగుపడి గొర్ల కాపరి మృతి

Submitted by Yellaia kondag… on Thu, 29/09/2022 - 12:32
Tragedy in Tungaturthi.. Shepherd died due to lightning

తుంగతుర్తి, సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి); గొర్లను మేపడానికి వెళ్లిన ఓ వ్యక్తితో పాటు మూడు మేకలు పిడుగుపాటుకు గురై మృతి చెందిన సంఘటన తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన వీరబోయిన నాగరాజు (30)తండ్రి బిక్షం  తో కలిసి బాలికల గిరిజన గురుకుల పాఠశాల వెనకాల  గొర్లను మేపుతుండగా సాయంత్రం సమయంలో అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండడంతో పక్కనే ఉన్న చెట్టు కిందికి వెళ్లగా ఆ సమయంలో పిడుగు పడి నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో నాగరాజుకు చెందిన మూడు మేకలు కూడా మృత్యువాత పడ్డాయి. కళ్ళముందే కొడుకు పిడుగుపాటుకు గురై మృతి చెందగా తాను ప్రమాదం నుండి తప్పించుకోగలిగాడు.ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. నాగరాజు మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతుడు నాగయ్యకు భార్య ఇద్దరు సంతానం ఉన్నారు.