పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం: ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్

Submitted by bosusambashivaraju on Tue, 27/09/2022 - 12:30
Telangana government's aim is the welfare of the poor: MLA, ZP Chairman

చిల్పూర్, సెప్టెంబర్ 26, ప్రజా జ్యోతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమమే లక్ష్యంగా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించి బడుగు బలహీన వర్గాల ప్రజలకు తోడుగా నిలుస్తున్నారని తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగాం జిల్లా 
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,జడ్పీ చైర్మన్ పాగాలసంపత్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా సోమవారం చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు  గ్రామ సర్పంచ్ మామిడాల లింగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆసర పెన్షన్ కార్డులు, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమనికి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.అంతకుముందు చాకలి ఐలమ్మ  జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఐలమ్మ  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి బొమ్మిశెట్టి సరిత బాలరాజు, మండల పార్టీ అధ్యక్షులు రమేష్ నాయక్, యంపిటిసి తాళ్లపల్లి ఉమా సమ్మయ్య గౌడ్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, నియోజకవర్గ నాయకులు వెంకట్ స్వామి, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శశిధర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు హరిబాబు, వార్డు సభ్యులు, స్థానిక డీలర్లు, అంగన్వాడి టీచర్లు ,ఆశ కార్యకర్తలు,ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.