సంక్షేమ పథకాలలో దూసుకుపోతున్న తెలంగాణ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

Submitted by srinivas on Thu, 29/09/2022 - 10:31
Telangana is advancing in welfare schemes MLA Gandra Venkataramana Reddy

రేగొండ సెప్టెంబర్ 28 ప్రజాజ్యోతి .//...   రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ రాష్ట్ర అభివృద్ధికి పాల్పడుతుందని ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రాయపల్లి, దమన్నపేట, దామరంచపల్లి గ్రామాలలో బతుకమ్మ చీరలు ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఎమ్మెల్యే గండ్ర  మాట్లాడుతూ  అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్ కార్డులను మంజూరు చేస్తున్నామని అన్నారు. ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరే సారే ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే నిధులను నిలిపివేసిందని అన్నారు. లేనిపోని ఆరోపణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని పై నిందలు వేస్తుందని అన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు ఇంటింటికి చేరుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పున్నం లక్ష్మి- రవి, రైతు బంధు జిల్లా అధ్యక్షులు హింగే మహేందర్, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ నడి పెళ్లి విజ్ఞాన్ రావు, జెడ్పీ కొప్షన్ సభ్యులు రహీం,  మండల అధ్యక్షులు అంకం రాజేందర్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దాసరి నారాయణ రెడ్డి, సర్పంచ్ లు నడి పెళ్లి శ్రీనివాస్ రావు, జూపాక నీల- నిలాబ్రం, గుండు బుచ్చమ్మ,. ఆంబల చందు, పబ్బా శ్రీనివాస్ గౌడ్, ఎంపిటిసిలు ఐయిలి శ్రీధర్ గౌడ్, కేశిరెడ్డి ప్రతాప్ రెడ్డి, బోట్ల కవిత- సామ్రాట్, బల్గురి సుష్మా స్వరాజ్, నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్, మైస బిక్షపతి, సామల పాపి రెడ్డి, పట్టేం శంకర్, కోలెపాక బిక్షపతి, మధాడి కర్ణకార్ రెడ్డి,  బండి భద్రయ్య, బండి కిరణ్, కొడేపాక మొగిలి, దాట్ల రాజేందర్, దాట్ల రమేష్, పెరుమండ్ల మహేందర్, చల్లగురుగుల సుదర్శన్, తడక శ్రీకాంత్ గౌడ్, సమ్మయ్య, రాజు, రవీందర్, శ్రీపతి శ్రీనివాస్, కర్నే జ్యోతి, సిద్ధ సమ్మయ్య, మంద జయపాల్ తది తరులు పాల్గొన్నారు.