వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తహశీల్దార్

Submitted by sridhar on Tue, 13/09/2022 - 11:35
Tehsildar visited the flood affected areas

 ( నూగూరు) సెప్టెంబర్ 12 (ప్రజా జ్యోతి);  జిల్లా కలెక్టర్  సూచన మేరకు వెంకటాపురం మండలం లో సోమవారం టిసి లో తహశీల్దార్ ఆంటీ నాగరాజు, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి అడ్డూరి బాబు కలిసి వరద ప్రభావిత ప్రాంతాలలో, గ్రామ పంచాయతీ లోని  గ్రామలను సందర్శించి, గ్రామంలో విస్తృత ప్రచారం చేయాలని , ప్రజలకు నిత్యావసర సరుకులు ఇతర వస్తువులను బఫర్ స్టాక్‌లో ఉంచుకోవాలని ప్రజలను కోరాలని గ్రామ పంచాయతీ సర్పంచ్‌లను ఆదేశించారు. ఈ వారంలో భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని, భారీ వర్షం విస్తీర్ణం ఏర్పడితే బారికేడ్లను ఏర్పాటు చేసి జాగ్రత్తగా ఉండాలనిగ్రామ పంచాయతీ సిబ్బంది ని మండల స్థాయిఅధికారులు సిబ్బందిని ఆదేశించారు .