యాదాద్రి భువనగిరి

ఘనంగా సర్పంచ్ తలబోయినా గణేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

Submitted by krishna swamy on Sat, 17/09/2022 - 11:12

బిబినగర్, సెప్టెంబర్ 16 (ప్రజా జ్యోతి). మండలంలోని పడమటిసోమారం గ్రామ సర్పంచ్ తలబోయినా గణేష్ యాదవ్ జన్మదిన వేడుకలు నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ తలబోయినా గణేష్ యాదవ్ కి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు యార్కల సుదర్శన్ గౌడ్ రాయరావుపేట దేవస్థాన కమిటీ చైర్మన్ కోట్ల పెంటేష్ గౌడ్, డైరెక్టర్ బండ అశోక్, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్  గౌడ్ యువ సైన్యం యర్కాల క్రిష్ణ గౌడ్,బొమ్మగోని విజయ్ గౌడ్ గోరికంటి వేణు,కంచిమేకల ఆంజనేయులు, శేఖర్ గౌడ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు - మాజీ సర్పంచ్ ఒగ్గు పాండు

Submitted by krishna swamy on Fri, 16/09/2022 - 10:57

బిబినగర్, సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి). తెలంగాణ ప్రభుత్వం నూతన సెక్రటేరియకు రాజ్యాంగ నిర్మాత విద్యావేత్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించడం తెలంగాణ యావజాతి గర్వించదగ్గ విషయం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిబినగర్ మండలంలోని మగ్దూంపల్లి మాజీ సర్పంచ్ ఒగ్గు పాండు మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్లమెంటు నూతన భవనానికి కూడ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని దానికి బీజేపీ నాయకులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఘన స్వాగతం పలికిన అయోధ్య యాదవ్

Submitted by mallesh on Wed, 14/09/2022 - 15:53

చౌటుప్పల్ సెప్టెంబర్ 13 ప్రజా జ్యోతి ;  గొల్ల కురుమల సంక్షేమంతో పాటు మాంసం ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెల పంపక  కార్యక్రమాన్ని ప్రారంభించారని సినీ ఫోటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.బుధవారం మునుగోడు మండలం కృష్టపురం గ్రామంలో. గొర్రెల వ్యాక్సిన్ పంపిణీ చేపల పంపిణీ కార్యక్రమానికి వెళుతున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్  దూదిమెట్ల బాల్ రాజ్ యాదవ్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ లకు, బుధవారం చౌటుప్పల్ మండల కేంద్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన అయోధ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. 

అంత్యక్రియల కోసం పలువురు నేతల ఆర్థిక సహాయం

Submitted by srinivas on Wed, 14/09/2022 - 15:05

యాదాద్రిజిల్లా(ప్రజాజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని దత్తాయిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల మల్లయ్య అకస్మాత్తుగా మరణించారు.ఇటీవల కాలం లో మల్లయ్య 2 వ కుమారుడు ఏమిలేష్ చనిపోవడం తో వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకొని అంత్యక్రియల కోసం గ్రామ సర్పంచ్ వెన్న కూచి రామ్మోహన్ శర్మ 5000 రూపాయల ఆర్థిక సాయం,అలాగే బిజెపి రాష్ట్ర నాయకుడు పడాల శ్రీనివాస్ 5000 రూపాయలను ఆర్థిక సహాయం చేశారు.ఈ కార్యక్రమంలో ఎరుకల స్వామి గౌడ్, పాల నరేష్, ధ్యానబోయిన వెంకటేష్, బాల కృష్ణ, ప్రవీణ్,గాదె ప్రవీణ్, కృష్ణ, కొండల్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం చేసిన పలుహురు నేతలు

Submitted by P.mahender on Wed, 14/09/2022 - 14:54

యాదాద్రిజిల్లా(ప్రజాజ్యోతి): ; యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని దత్తాయిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల మల్లయ్య అకస్మాత్తుగా మరణించారు.ఇటీవల కాలం లో మల్లయ్య 2 వ కుమారుడు ఏమిలేష్ చనిపోవడం తో వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకొని అంత్యక్రియల కోసం గ్రామ సర్పంచ్ వెన్న కూచి రామ్మోహన్ శర్మ 5000 రూపాయల ఆర్థిక సాయం,అలాగే బిజెపి రాష్ట్ర నాయకుడు పడాల శ్రీనివాస్ 5000 రూపాయలను ఆర్థిక సహాయం చేశారు.ఈ కార్యక్రమంలో ఎరుకల స్వామి గౌడ్, పాల నరేష్, ధ్యానబోయిన వెంకటేష్, బాల కృష్ణ, ప్రవీణ్,గాదె ప్రవీణ్, కృష్ణ, కొండల్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఉచిత కోచింగ్ దరఖాస్తు చేసుకోండి

Submitted by krishna swamy on Wed, 14/09/2022 - 14:29
  • తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు

భువనగిరి, సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి) తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూపు 2, గ్రూప్ 3, గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సీఈవో ఐఏఎస్ అధికారి రఘురామ శర్మ తెలిపారని అర్హులైన బ్రాహ్మణ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పోచంపల్లి రమణారావు విజ్ఞప్తి చేశారు.

ఎమ్మార్పీఎస్ నాయకులు అరెస్ట్

Submitted by krishna swamy on Tue, 13/09/2022 - 20:22

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) వీఆర్ఏలకు మద్దతుగా అసెంబ్లీ ముట్టడికి సిద్దమవుతున్న భూదాన్ పోచంపల్లి ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు అని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ కొమ్మన బాల నరసింహ మాదిగ ఎమ్మార్పీఎస్ పోచంపల్లి పట్టణ అధ్యక్షులు పెద్దల శీను మాదిగ నాయకులు మూటపురం రవి మాదిగ ఉద్యమ నాయకులు మంచాల మధు మాదిగ నాయకులు కొమ్ము లక్ష్మణ్ మాదిగ, కుక్క దానయ్య మాదిగ, బాలయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.

గౌసుకొండలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ

Submitted by krishna swamy on Tue, 13/09/2022 - 12:16

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) మండలంలోని గౌస్ కొండ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితులు కాసుల వీరేష్ గౌడ్ కు 20,000 రూపాయల చెక్కును స్థానిక సర్పంచ్ పక్కిర్ లావణ్య దేవేందర్ రెడ్డి టీఆరెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వాకిటి బాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

గౌసుకొండలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ

Submitted by krishna swamy on Tue, 13/09/2022 - 12:04

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) ; మండలంలోని గౌస్ కొండ గ్రామంలో స్థానిక పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితులు కాసుల వీరేష్ గౌడ్ కు 20,000 రూపాయల చెక్కును స్థానిక సర్పంచ్ పక్కిర్ లావణ్య దేవేందర్ రెడ్డి టీఆరెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వాకిటి బాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారం మరువలేనిది అని కొనియాడారు.