కిడ్స్ ప్లే జోన్ ప్రారంభించిన కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్
ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 28 సెప్టెంబర్,../ సూర్యాపేట పట్టణంలో ఫన్ విల్లే కిడ్స్ ప్లే జోన్ 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ తో కలిసి 44వ వార్డు కౌన్సిలర్ కెక్కిరేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు పాఠశాలలో చదువుతోపాటు క్రీడలు, వినోదాలు చిన్నారుల మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతాయని అన్నారు. ఈ కిడ్స్ ప్లే జోన్ లో చిన్నారులకు బాల్ పూల్ స్పైడర్, సాఫ్ట్ ప్లే, జంపింగ్ బాల్స్, కిచెన్ రూమ్, ప్లే మినీ కార్, రాకర్స్, ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.