Kodangal

మృతదేహాలకు నివాళులర్పించిన కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి

Submitted by VadlaVijayKumarChari on Wed, 28/09/2022 - 12:43

కొడంగల్, సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి).//.. కొడంగల్ నియోజకవర్గం పరిధిలోనిబొంరాస్పెట్ మండల కాంగ్రెస్ నాయకులు  బ్యాగారి రాములు కుమారుడు రోహిత్ అకాల మరణం చెందడంతో  కొడంగల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగదీష్ మృతి చెందిన విషయం కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి ఈ విషయం తెలుసుకొని వారి మృతదేహాలకు బుధవారం రోజు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

దుద్యాల నూతల మండల కార్యాలయాలు ఏర్పాటు కోసం అధికారులు పనులు ముమ్మరం చేశారు

Submitted by VadlaVijayKumarChari on Wed, 28/09/2022 - 12:26

కొడంగల్, సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి).//... కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మడి కోస్గి మండలంలో నూతనంగా దుద్యాల మండలం ను వచ్చేనెల లో ఏర్పాటు కోసం అధికారులు నూతన కార్యాలయాల కోసం బుధవారం రోజు గ్రామంలో ఉన్న కొన్ని గృహాలను ఎంచుకున్నారు వాటిని ఒక సంవత్సరం పాటు ఒప్పందం చేసుకుంటున్నామని అధికారులు వివరించారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే రావడం జరిగిందని గ్రామ సర్పంచ్ కు ఉన్నత అధికారులు తెలియజేశారు

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన జడ్పిటిసి

Submitted by VadlaVijayKumarChari on Wed, 28/09/2022 - 12:24

కొడంగల్, సెప్టెంబరు 27(ప్రజాజ్యోతి).//..కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని  మద్దూర్ మండల పరిధిలోని భీంపురం చిన్న రెడ్డి పల్లి రేణిగుంట్ల గ్రామాలలో మంగళవారం రోజు జడ్పిటిసి రఘుపతి రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి సింగిల్ విండో చైర్మన్ జగదీష్ తదితరుల పాల్గొన్నారు