చిల్పూర్

నూతన సిఐ గా బాధ్యతలు చేపట్టిన సంతోష్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీపీ

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:12

చిల్పూర్, సెప్టెంబర్ 21, ప్రజా జ్యోతి:  రఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్కు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ సంతోష్ కుమార్ కు చిల్పూరు మండల నాయకులు సీఐ సంతోష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువానుతో సన్మానించి,పూల బొకేను అందించి  శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ రంజిత్ రెడ్డి,నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రంగు రమేష్ గౌడ్, ఏఎంసీ మార్కెట్ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, సీనియర్ నాయకులు మారబోయిన ఎల్లయ్య, మాజీ మండల అధ్యక్షుడు గుర్రపు వెంకటేశ్వర్లు, మంతెన రాజు తదితరుల పాల్గొన్నారు.

సర్పంచ్ ప్రత్యూష రెడ్డి ని సన్మానించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:38

చిల్పూర్, సెప్టెంబర్ 19 , ప్రజా జ్యోతి:  ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ స్మార్ట్ గ్రామపంచాయతీలు, గ్రామీణ వర్గాల సాధికారత అనే అంశంపై జరిగిన జాతీయ సర్పంచుల సదస్సుకు జనగాం జిల్లా చిల్పూరు మండలం శ్రీపతి పల్లి గ్రామ సర్పంచ్ కేశిరెడ్డి ప్రత్యూష మనోజ్ రెడ్డి ఎంపికై సదస్సులో పాల్గొనడం హర్షించదగ్గ విషయమని తెలంగాణ మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.ఈ సందర్భంగా సోమవారం చిల్పూరు మండలం  శ్రీపతి పల్లి గ్రామ పంచాయతీ నందు ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా కడియం శ్రీహరి హాజరై గ్రామ సర్పంచ్ ప్రత్యూష మనోజ్ రెడ్డి లక్నోలోని సర్పంచుల సదస్సుకు

అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు మంజూరు: ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్

Submitted by bosusambashivaraju on Fri, 16/09/2022 - 12:56

చిల్పూర్, సెప్టెంబర్ 15, ప్రజా జ్యోతి:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జెడ్పీ చైర్మన్ భాగాల సంపత్ రెడ్డి లు అన్నారు. ఈ సందర్భంగా గురువారం చిల్పూరు మండలం పల్లగుట్ట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ విజయవంతం చేయాలి:జెడ్పీ చైర్మన్

Submitted by bosusambashivaraju on Fri, 16/09/2022 - 12:53

చిల్పూర్, సెప్టెంబర్ 15,ప్రజా జ్యోతి. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని జనగాం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం చిల్పూర్ మండల కేంద్రంలోని ఎంఆర్ సి భవన్ నందు ఎంపిపి సరిత  అధ్యక్షతన నిర్వహించారు.