టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
మద్దిరాల మండలంసెప్టెంబర్ 8 (ప్రజా జ్యోతి) తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో మద్దిరాల మండల కేంద్రానికి చెందిన తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ ప్రధాన కార్యదర్శి వల్లపు రమేష్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కస్నబోయిన వెంకన్న,రాంపాక బుచ్చయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు *తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.నూతనంగా TRS పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.