ఆర్థిక సహాయం అందజేసిన వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 29 ( ప్రజాజ్యోతి ) : - మండలంలోని తాటికొండ గ్రామంలో జీబీ తండా 5వ వార్డులోని గుగులోతు తేజ ఇటీవల మరణించినందున గురువారం స్టేషన్ ఘనపూర్ వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.