వయో వృద్ధుల సంక్షేమమే లక్ష్యం జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత
హనుమకొండ, సెప్టెంబర్26 (ప్రజాజ్యోతి)../... అంతర్జాతీయ వయో వృద్దుల వారోత్సవాలలో భాగంగా సోమవారం ఫాతిమానగర్ లోని సెయింట్ ఆన్స్ వృద్ధాశ్రమంలో ఉన్న వారికి క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు మహిళలు పిల్లలు దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.అనంతరం హనుమకొండ సిడిపివో కే మధురిమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సంక్షేమ అధికారి సబిత మాట్లాడుతూ వివిధ వృద్ధాశ్రమాలలో ఉన్న వారు తమకు ఎవరు లేరని, ఒంటరి వారిమనే దిగులు చెందవద్దని, వృద్దులకు చేయూత నివ్వడానికి ప్రభుత్వం అధికారులు ఉన్నారని అన్నారు.