క్రీడల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

Submitted by srinivas on Thu, 29/09/2022 - 10:57
 Talent of Gurukul students in sports

 చిట్యాల సెప్టెంబర్ 28,ప్రజాజ్యోతి.//.. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు లక్షెట్టిపేట లోజరిగిన  జోనల్ లెవెల్ క్రీడలలో పాల్గొని  ప్రతిభను కనబరిచినట్లు ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి తెలిపారు. ఖో ఖో, వాలీబాల్,  కబడ్డీ క్రీడలలో ప్రథమ ద్వితీయ బహుమతుల తో పాటు అథ్లెటిక్స్ లో  ప్రథమ బహుమతి పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డి సి ఓ ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి, వైస్ ప్రిన్సిపల్ కె సత్యం, పీఈటీలు లావణ్య, వెన్నెలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునులు పి. కవిత, కె. జయసుధ, బి. శ్రీలత, పి. దివ్య, ఒ.వాసవి లో పాల్గొన్నారు