వసతి గృహంలో గడ్డిని తొలగిస్తున్న విద్యార్థినులు

Submitted by veeresham siliveru on Thu, 08/09/2022 - 18:05
Students removing the grass in the dormitory
  •  
  • పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి- ఏ ఎస్ డబ్ల్యూ ఓ రఘురామయ్య

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 8, ప్రజా జ్యోతి : తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రఘురామయ్య విద్యార్థులకు సూచించారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నీ బాలికల వసతి గృహంలో గురువారం స్వచ్ఛ హాస్టల్ కార్యక్రమం నిర్వహించారు. వసతి గ్రామం ఆవరణలోని గడ్డి మొక్కలను, చెత్త ముచ్చదాన్ని తొలగించారు. వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి సీజనల్ వ్యాధులు రావని తెలిపారు. విద్యార్థులకు అందించే మెనూ పరిశీలించారు. ఆహార పదార్థాలను చూశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రమాదేవి పాల్గొన్నారు.