అలంపూర్,(ప్రజా జ్యోతి) అక్టోబర్ 1: దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవములు సందర్భంగా శ్రీ.శ్రీ.శ్రీ.జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్న మంత్రి వర్యులు శ్రీ.ఇంద్రకరణ్ రెడ్డి ,స్థానిక శాసనసభ్యుడు అబ్రహం, మరియు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత,జిల్లా కలెక్టరు వల్లూరు క్రాంతి ఆలయాలను దర్శించుకోవడానికి వచ్చిన మంత్రి కి, ఎమ్మెల్యే అబ్రహం పూల బుకే ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం ఆలయ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, మరియు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు శ్రీ.శ్రీ.శ్రీ. బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలో ప్రత్యక్య పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తిస్కున్నారు ఆలయ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి , వారికి అమ్మవారి తిర్తా ప్రసాదాలను అందజేశారు
అనంతరం మంత్రి మీడియా తో మాట్లాడుతూ..
అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ , సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధిలో ముందు ఉండాలని కోరుకున్నట్టు తెలియజేశారు దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవములు సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ విషయంలో ప్రతి పక్షాలు రాజకీయం చేస్తున్నారు అని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆలయానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఎలాంటి పట్టు వస్త్రాలు సమర్పించడం లేదు ఆ ఆలయాలకు వచ్చిన భక్తుల విరారాలతో కానీ ఆదాయంతోనే పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరుపున సమర్పించడం జరుగుతుంది అని తెలిపారు దయచేసి ఆలయ పై రాజకీయ రంగులు పుయొద్దని తెలియజేశారు, ఈ సారి కూడా అలాగే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అని తెలిపారు అలాగే నిన్నే అమ్మవారికి అభిషేకం మరియు హోమం చేసే పూజ సామాగ్రిని ఆలయ చైర్మెన్,కి సీఎం కేసీఆర్ ,ఇంటి నుండి పంపించారని తెలిపారు నాలుగవ తారీకు రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మరియు సీఎం కుటుంబ సభ్యులు మొత్తం అమ్మవారిని దర్శించుకోవడానికి రానున్నారని తెలిపారు,
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
- 4 views