లక్ష్మీనరసింహారావు జన్మదినోత్సవం-
తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు
భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి)' తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ జర్నలిస్టు చెన్నూరి లక్ష్మీనరసింహారావు (అన్వేషి) జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు అన్నారు. బుధవారం నాడు చెన్నూరి లక్ష్మీనరసింహారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయనను శాలువతో సత్కరించడంతోపాటు రాష్ట్రంలో అనేక సమస్యలపై తన పత్రిక ద్వారా పరిష్కారాలు వెతుకుతూ నేటి యువతకు దారులు చూపుతున్న లక్ష్మీనరసింహారావు సేవలు అమోఘమని కొనియాడారు. పాత్రికేయులుగా పూర్వ ఆశ్రమంలో ప్రభుత్వ ఉద్యోగిగా తన వంతు సేవలు అందించి విశ్రాంత ఉద్యోగిగా కొనసాగుతున్న లక్ష్మీనరసింహారావు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొని బ్రాహ్మణ సమాజానికి తన వంతు సేవ చేయాలని రమణారావు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవులపల్లి రంగారావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంత్రి సునీల్, అశోక్ కుమార్, దేవులపల్లి బాలచందర్ శర్మ, తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రంగారెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి అక్కినేపల్లి పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు.
- 2 views