జగిత్యాల ప్రతినిధి, సెప్టెంబర్ 4 (ప్రజాజ్యోతి) : తెలంగాణ అల్ సీనియర్ సీటీజన్స్ అసోసియేషన్ సారంగాపూర్ మండల అధ్యక్షుడుగా కాలగిరి గంగ రెడ్డిని నియమించినట్లు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ తెలిపారు. ఆదివారం సంఘ కార్యాలయంలో జగిత్యాల పట్టణం, మండలం, సారంగాపూర్, కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి మండలాలకు చెందిన పలువురికి సీనియర్ సీటీజన్స్ కార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా కాలగిరి గంగారెడ్డి మాట్లాడుతూ జిల్లా సీనియర్ సీటీజన్స్ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలంలో సీనియర్ సీటీజన్స్ సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. అనంతరం నూతనంగా నియమితులైన కాలగిరి గంగారెడ్డిని జిల్లా గౌరవ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ చైర్మన్ జీఆర్ దేశాయ్, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, కోశాధికారి వేల్ము ల ప్రకాష్, సీనియర్ న్యాయవాది పుప్పాల సత్యనారాయణ అభినందనలు తెలిపారు.
- 1 view