విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేస్తున్న సర్పంచ్ శ్రీహ

Submitted by veeresham siliveru on Tue, 06/09/2022 - 11:15
Sarpanch Sriha distributing clothes to students
  • విద్యార్థులకు దుస్తులు పంపిణీ

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 5,  ప్రజాజ్యోతి: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సర్పంచ్ శ్రీహరి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం  విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

 అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారని ,అందుకే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ దూసరి వెంకటేష్ గౌడ్, ప్రధానోపాధ్యాయుడు అశోక్ రెడ్డి , ఉపాధ్యాయులు కొత్త కోటేశ్వర్, శోభారాణి ,అనిత , టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ బిక్షం, కొప్పు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.