గుర్రంపోడ్:సెప్టెంబర్ 29(ప్రజా జ్యోతి),..//గుర్రంపోడు మండలం లోని కోతులాపురం గ్రామపంచాయతీలో గురువారం గ్రామ సర్పంచ్,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రావులపాటి భాస్కర్ గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేసి రాష్ట్రంలోని మహిళలకు పెద్దన్నయ్య లాగా వ్యవహరించి మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొడ్డు వెంకటమ్మ,పంచాయితీ కార్యదర్శి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
- 4 views