సంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అమృత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ

Submitted by kosgi narsimulu on Fri, 30/09/2022 - 16:48
 Sankireddypalli village sarpanch Amrit Reddy was the MLC who visited the family

తాండూరు సెప్టెంబర్ 30 ప్రజా జ్యోతి:-   తాండూర్ మండలం సంకిరెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ అమృత్ రెడ్డి  మాతృమూర్తి పట్లోళ్ళ రాధమ్మ  అనారోగ్యంతో గురువారం నాడు మృతిచెందారు.  విషయం  తెలుసుకొన్న  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి శుక్రవారం నాడు తాండూరు మండలం సంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అమృత్ రెడ్డి  కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తో పాటు తాండూర్,పెద్దేముల్‌  పిఎసిఎస్ చైర్మన్లు రవీందర్  గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి , టిఆర్ఎస్ పార్టీ సీనియర్  నాయకులు గౌడి వెంకటేశం, శ్రీకాంత్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, తదితరులు గ్రామస్తులు హాజరయ్యారు.