సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం

Submitted by Tirumalashetty… on Thu, 15/09/2022 - 06:52
Aswaraopeta

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవం ఘనంగా నిర్వహిద్దాం
- నిజాం రాచరికపాలన నుంచి స్వాతంత్రం వచ్చిన రోజు... ఎమ్మెల్యే మెచ్చా
అశ్వారావుపేట,సెప్టెంబర్14, ప్రజాజ్యోతి: నిజాం రాచరిక పాలన నుంచి 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం వచ్చిందని అటువంటి రోజును తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవంగా ఘనంగా నిర్వహించుకుందామని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ఈనెల 16వ తేదీ నియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలో నిర్వహించే ర్యాలీ, సభనిర్వహణ కార్యక్రమాలపై బుధవారం ఎమ్మెల్యే  మెచ్చా నాగేశ్వరరావు తమ క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణప్రభుత్వం వజ్రోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు తాము నిర్వహించే బాధ్యతల పట్ల జాగ్రత్తలు వహించాలని అందరూ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి, తహసిల్దార్ చల్లాప్రసాద్, ఎంపీడీవో విద్యాధరరావు, ఎస్ఐ చల్లా అరుణ, వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు అఫ్జల్ బేగం, సిడిపిఓ రోజారాణి, తదితరులు పాల్గొన్నారు